Monday, September 17, 2012

My Form

Friday, June 29, 2012

Latest update

Life is busy...

Monday, February 6, 2012

Queen


హోం > వివరాలు
కవర్ స్టోరీ | కూల్ | సినిమా | కథలు | కాలమ్స్
కిడ్స్ | నవ్వులు | అక్షరం | రాశి ఫలాలు | లేఖలు
కీర్తి కిరీటానికి షష్టిపూర్తి
సందర్భం
ఆధునికతకు ఒక్కోసారి వ్యతిరేకపదంగా కనిపించే రాచరికం
విచిత్రంగా అభివృద్ధి చెందిన దేశాల్లోనే కొనసాగుతోంది. జపాన్, నెదర్లాండ్స్, నార్వే, స్వీడన్‌లాంటి దేశాలు ఇందుకు చక్కటి ఉదాహరణ. ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతున్న ఈ కాలంలో ఆయా దేశాల రాజుల అధికారాలు చాలావరకు పరిమితంగానే ఉన్నప్పటికీ, ప్రజలకు వారే

‘పెద్దదిక్కు’గా వ్యవహరిస్తున్నారు, అత్యంత జనాదరణకు పాత్రులవుతున్నారు. అలాంటి ఒక మహారాణి,
‘అఖిల జగతి’ సామ్రాజ్ఞి, రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యపు రాచజ్యోతి... రెండో ఎలిజబెత్. ఫిబ్రవరి 6, 1952న తన పాతికేళ్ల వయసులో సింహాసనం అధిరోహించిన ఈ రాజకుమారి...

పట్టాభిషిక్తురాలై అరవై ఏళ్లు
కావస్తోంది. ఆ సందర్భంగా ఆమె
జీవితచరిత్రలోంచి కొన్ని విశేషాలు...

అనగనగనగా....
ఒక రాకుమారుడు. పేరు విలియమ్-1. నార్మండీ ప్రాంతపువాడు. ఇప్పటి ఫ్రాన్స్‌లో అది అంతర్భాగం. ఆ కాలం క్రీ.శ.1066. ఆ సమయంలో ఇంగ్లండ్‌ను హెరాల్డ్ గాడ్‌విన్సన్ పాలిస్తున్నాడు. అప్పటి రాజరికపు ధర్మాల ప్రకారం విలియమ్ తన సామ్రాజ్య విస్తరణలో భాగంగా హెరాల్డ్ మీదకి దండెత్తి వచ్చాడు. యుద్ధం జరిగింది. బ్యాటిల్ ఆఫ్ హేస్టింగ్స్! ఓడిన హెరాల్డ్ మరణించాడు. గెలిచిన విలియమ్... ‘విలియమ్ ద కంకెరర్’(విజేత విలియమ్) అయ్యాడు. ఇంగ్లండ్‌కు తిరుగులేని రాజయ్యాడు. ఇక, ఆ నేల మీద నార్మన్ల శకం అప్పట్నుంచి ప్రారంభమైంది.

1087లో విలియమ్ మరణించిన అనంతరం ఆయన పుత్రుడు హెన్రీ-1 పట్టాభిషేకం గావించుకున్నాడు. ఇక ఆ పరంపరలో (క్రమంలో కాదు) ఎడ్వర్డ్-3, జేమ్స్-6, ఎలిజబెత్-1, జార్జ్-3, క్వీన్ విక్టోరియా లాంటివాళ్లు సుదీర్ఘంగా రాజ్యం చేస్తూవచ్చారు. సామ్రాజ్యాన్ని కూడా అలాగే విస్తరింపజేశారు. ఇంగ్లండ్, స్కాట్లాండ్, వేల్స్, ఉత్తర ఐర్లాండ్ (ఈ నాలుగూ కలిపితే ప్రస్తుత గ్రేట్ బ్రిటన్) సహా ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, కెనడా నుంచి అమెరికా, దక్షిణాఫ్రికా, భారత్‌లాంటి ఎన్నో దేశాలను అఖండంగా పరిపాలించారు... కొన్ని ప్రత్యక్షంగా, కొన్ని పరోక్షంగా.

ఇక అదే వంశాంకురమైన ఎలిజబెత్-2, మనం మాట్లాడుకుంటున్న రాకుమారి, విలియమ్-1కు ముని ముని ముని....(23వ) ముని- మునిమనవరాలుగా ఈ భూమ్మీద ఇంకా పుట్టాల్సివుంది.

రాణీ అయ్యే అవకాశమే లేదు...
కాలం దొర్లిపోయింది. ముత్తాతలు, తాతలు, తండ్రులు పరమపదించారు. అప్పటికి బ్రిటన్ పార్లమెంట్ బలోపేతమై, రాజరికం నామమాత్రమైపోయినా, రాజులకు, రాజవంశీయులకు ప్రజల గౌరవాభిమానాలు ఎంతమాత్రమూ తగ్గలేదు. అలాంటి దశలో బ్రిటిష్ సామ్రాజ్యాధినేత పీఠం మీద కూర్చున్న ఎడ్వర్డ్-8 ప్రేమలో పడ్డారు. అదీ ఒక అమెరికన్‌తో. అదీ రాచకన్య కాని మనిషితో. అదీ ఇద్దరు భర్తలకు విడాకులిచ్చిన మహిళతో.

అలాంటి ఒక స్త్రీని పెళ్లిచేసుకోవడానికి ప్రజామోదం ‘లభించదు’ కనుక, 1936లో ఇక తాను రాజుగా కొనసాగబోనని బహిరంగంగా/అధికారికంగా ప్రకటించారు ఎడ్వర్డ్. దాంతో సహజంగానే ఆయన తమ్ముడు ఆల్బర్ట్ కిరీటధారి అయ్యారు. ఈ ఆల్బర్ట్ సంతానమే ఎలిజబెత్-2, మార్గరెట్ (ఇద్దరూ పుత్రికలే).

ఎడ్వర్డ్ గనక రాజుగా కొనసాగివుంటే... తొలి సంతానం, మళ్లీ వాళ్ల తొలి సంతానం మాత్రమే ప్రథమ వరుసలో ఉండే రాజపీఠానికి ఎలిజబెత్ ‘దాదాపుగా’ చేరువయ్యేవారు కాదు. ఒకవిధంగా ఆమె పెదనాన్న ఎడ్వర్డ్ తప్పుకొని ఆమెకు దారి సుగమం చేశారు.



పుట్టింది రాజకుమారి...
విశాలమైన భవనాలు, విలాసమైన వస్తువులు, మిరుమిట్లు గొలిపే అలంకరణలు, జిగేల్మనే వస్త్రధారణలు, ఘుమఘుమలాడే వంటకాలు, అడుగడుక్కీ సపర్యలు చేసే పరిచారికలు, వచ్చీపోయే అతిథులు, మాటలు మర్యాదలు... ఇదీ రాజవంశస్థుల నివాసమైన బకింగ్‌హామ్ ప్యాలెస్ వాతావరణం. ఇక్కడ పెట్టిపుట్టారు ఎలిజబెత్. రాకుమారి అంటే రాకుమారిలానే పెరిగారు. ముద్దుగా ఆమెను లిలిబెట్ అని పిలిచేవారు. తమ బకింగ్‌హామ్ ప్యాలెస్‌లోనే ఆమెకు తల్లిదండ్రులు చరిత్ర, రాజ్యాంగం అధ్యాపకులచేత బోధింపజేశారు. సంగీతం, గుర్రపు స్వారీల్లో శిక్షణ ఇప్పించారు. సాహిత్యం చదివించారు. ఫ్రెంచ్ భాష నేర్పించారు.

ఇంకా చిన్నారి కనుక ప్రజా బాహుళ్యంలోకి అప్పుడే తీసుకెళ్లకూడదన్న ఉద్దేశంతో తల్లిదండ్రులు ఆమెను ఇంట్లో వదిలి ఓసారి విదేశీపర్యటనకు వెళ్లినప్పుడు కన్నీళ్లు పెట్టుకున్నారట లిలిబెట్. అంత సున్నితంగా, సుకుమారంగా పెరిగిన ఎలిజబెత్ రెండో ప్రపంచ యుద్ధ సమయంలో తన 14వ ఏట తొలిసారిగా బీబీసీ రేడియోలో ప్రసంగించారు.

యుద్ధం వల్ల నగరాల్లోంచి తరలించిన చిన్నారులకు ‘చివరికి అంతా బానే జరుగుతుం’దని ధైర్యం నూరిపోశారు. 18 ఏళ్లు రాగానే బ్రిటన్ సైన్యపు మహిళా విభాగంలో డ్రైవర్, మెకానిక్‌గాసేవలందించారు. యుద్ధం ముగిసింది. జనాలు సంబరాలు చేసుకున్నారు. కలలు మేల్కొన్నాయి. అప్పటికే కౌమారంలోకి ప్రవేశించిన ఎలిజబెత్ తన కలల రాకుమారుడి గురించి కలలు కంటున్నారు. అదిగో, ఆ పూబాలను చేబూనే అతగాడు అక్కడెక్కడో పెరుగుతున్నాడు!

ప్రేమ పరీక్ష
ఫిలిప్... ఎలిజబెత్ కలల రాకుమారుడే కాదు, నిజమైన రాకుమారుడు కూడా! గ్రీకు రాజవంశానికి చెందిన ఫిలిప్ చిన్నపిల్లాడిగా ఉన్నప్పుడే అతడి తల్లిదండ్రులు దేశ బహిష్కారానికి గురైనారు. అయితే, అతడి తల్లి తరఫువాళ్లు బ్రిటనీయులే. అలా బ్రిటన్ వచ్చారు. తన 18వ ఏట బ్రిటన్ రాయల్ నేవీలో చేరారు. దూరపు చుట్టరికం కూడా ఉంది. ఫిలిప్‌ను తొలిసారి చూసేనాటికి ఎలిజబెత్‌కు 13 ఏళ్లు. లేత ప్రాణం. ఇరువురికీ పరిచయమయ్యింది. అది ప్రేమగా చిగురించింది.

ప్రేమలేఖలు చేతులు మారాయి. హృదయాలు చేరువయ్యాయి. చేతిని అందుకునే సమయం వచ్చింది. అయితే, కుమార్తెకు 21 ఏళ్లు వచ్చేవరకూ జార్జ్-6 వారి పెళ్లికి ఆమోదముద్ర వేయలేదు. ఇందులో ఇంకో సమస్య కూడా ఉంది. ఫిలిప్ పేరుకు యువరాజేగానీ చేయడానికి రాజ్యం లేదు. ఎంత బ్రిటన్ తల్లికి పుట్టినా, ‘ఒరిజినల్’ బ్రిటిష్ కాబోడు.

దీంతో ఫిలిప్ తన గత రాజరికపు బిరుదుల్ని వదులుకుంటున్నానని ప్రకటించారు. అమ్మమ్మ తరఫు ఇంటిపేరు ‘మౌంట్‌బాటన్’ను స్వీకరించి ఫిలిప్ మౌంట్‌బాటన్ అయ్యారు. తద్వారా ‘అచ్చమైన’ బ్రిటనీయుడయ్యారు. ఇన్నేళ్లూ వాళ్ల ప్రేమ పరీక్షలకు తట్టుకుని నిలబడింది. చివరకు 1947 నవంబర్ 20న వారి వివాహాన్ని జార్జ్-6 వైభవోపేతంగా జరిపించారు. అరవై నాలుగేళ్ల క్రితం అది ఒక నయనానందకర సన్నివేశం.

క్వీన్ ఎలిజబెత్-ఐఐ ప్రొఫైల్
పూర్తిపేరు: ఎలిజబెత్ అలెగ్జాండ్రా మేరీ విండ్సర్
జన్మదినం: 21 ఏప్రిల్ 1926
తల్లిదండ్రులు: {పిన్స్ ఆల్బర్ట్, లేడీ ఎలిజబెత్(కూతురు పేరు కూడా ఇదే కావడంతో గందరగోళాన్ని నివారించేందుకు ఈమెను ‘క్వీన్ ఎలిజబెత్ ద క్వీన్ మదర్’ అనడం పరిపాటి)
చెల్లి: మార్గరెట్
పెళ్లిరోజు: 20 నవంబర్ 1947
భర్త: ఫిలిప్ మౌంట్‌బాటెన్
పిల్లలు: ముగ్గురు కుమారులు(ప్రిన్స్ చార్లెస్, ప్రిన్స్ ఆండ్రూ, ప్రిన్స్ ఎడ్వర్డ్), ఒక్క కుమార్తె (ప్రిన్సెస్ అన్నే)
సింహాసనాన్ని అధిష్టించిన తేదీ: ఫిబ్రవరి 6, 1952 (తండ్రి మరణించిన వెంటనే)
పట్టాభిషేకం జరిగిన తేదీ: జూన్ 2, 1953
ప్రత్యేకత: {బిటన్‌ను సుదీర్ఘంగా పాలిస్తున్న వారిలో ఎలిజబెత్-2 రెండోవారు. ఆమె పీఠం ఎక్కి 60 ఏళ్లు. (63 ఏళ్లు పాలించిన క్వీన్ విక్టోరియా ప్రథమస్థానంలో ఉన్నారు).
వ్యాపకాలు: ఫొటోగ్రఫీ, గుర్రప్పందాలు, పెంపుడు కుక్కలతో గడపడం (పెంబ్రోక్ వెల్ష్ కెర్గి రకపు పొట్టికుక్కలంటే ఇష్టం. ఏడున్నాయట.)

రాణిగా పట్టాభిషేకం
పెళ్లయిన ఏడాదికి ప్రిన్స్ చార్లెస్‌కు జన్మనిచ్చారు ఎలిజబెత్. ఈ దశలోనే ఆమె తండ్రి జార్జ్ ఆరోగ్యం క్షీణిస్తూ వచ్చింది. చివరకు ఫిబ్రవరి 6, 1952న ఆయన మరణించడంతో ఎలిజబెత్ సహజంగానే ప్రిన్సెస్ నుంచి క్వీన్‌గా పరిణామం చెందారు.

అప్పుడామె వయసు 26 ఏళ్లు. విలియమ్-1 తర్వాత ఆయన వరుసలో వచ్చిన 40వ మోనార్క్ ఎలిజబెత్. ‘‘ఇందుమూలంగా సమస్త ప్రజానీకానికి తెలియజేయునది ఏమనగా- నా జీవితకాలం సుదీర్ఘమేగానీ, కనిష్టమేగానీ నేను బతికినంత కాలం ప్రజాసేవకే నా జీవితాన్ని అంకితం చేస్తాను’’ అని యావత్ బ్రిటిష్ సామ్రాజ్య ప్రజానీకానికి సందేశమిచ్చారు. కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, జమైకా, బార్బడోస్, బహమాస్, తువలు, సాల్మన్ ఐలండ్స్‌లాంటి పెద్ద, చిన్న 16 దేశాలకు ప్రస్తుతం ఆమె మహారాణి.

బ్రిటన్ ప్రధాని, మంత్రులతోపాటు వివిధ దేశాధ్యక్షులు, దౌత్యవేత్తలు, కళాకారులు, క్రీడాకారులు, సెలెబ్రిటీలు, సామాన్య సందర్శకులకు సమయం కేటాయించడంలోనే ఆమె సమయం గడిచిపోతుంది. ‘ఇది సాయంత్రం కాగానే ఇంటికెళ్లిపోయే ఉద్యోగం లాంటిది కాదు. నా ఉద్యోగం, జీవితం కలగలిసిపోయినాయి’ అంటారు తన రాణీతనం గురించి. అలాగే విస్తృతంగా విదేశీ పర్యటనలు చేస్తారు. దేశాలతో సత్సంబంధాలు నెలకొల్పే పాత్ర పోషిస్తారు. 1961లో భారత్ కూడా వచ్చారు.

బ్రిటన్ ప్రత్యక్ష పాలనపై ఆమె కీలక నిర్ణయాలు తీసుకోకపోయినా, ప్రతిదీ ఆమెకు తెలియపరుస్తారు. ఆమె తన ఉద్దేశాలు, కన్సర్న్స్ చెబుతుంటారు. ఉదాహరణకు ఇరాక్ యుద్ధంలో బ్రిటన్ సేనలను అంతకాలం ఉంచినందుకు టోనీ బ్లెయిర్‌ను తప్పుపట్టారు.

ప్రభుత్వ విధానాలకు సంబంధించిన ఎన్నో పత్రాలను చదవడంతోపాటు, ప్రపంచవ్యాప్తంగా వచ్చే ఉత్తరాలకు జవాబులిస్తారు. ‘అదృష్టవశాత్తూ నేను వేగంగా చదవగలను’ అంటారామె, నవ్వుతూ. ప్రత్యేక సందర్భాల్లో ప్యాలెస్ తరఫునే ఎంపిక చేసినవారికి శుభాకాంక్షలు పంపుతుంటారు. రాణి జీవనవిధానం బాగా తెలిసినవాళ్లు ‘ఏ రెండు రోజులూ ఆమెకు ఒకేలా జరగవు’ అంటారు.

ఆధునిక రాణి
పాలనాపరంగా ఆమె పెద్దగా ప్రభావం చూపలేకపోయినా, బ్రిటన్‌లోనే కాదు, ఎన్నో దేశాల్లో ఆమె ఒక గౌరవనీయమైన వ్యక్తి. ఎన్నికల్లో గెలిచిన ప్రధానులకన్నా స్వదేశంలో ప్రజాభిమానంలో ఆమెకే అగ్రతాంబూలం దక్కుతుంది. ఒకానొక దశలో ఆస్ట్రేలియాలో ఆమె పర్యటించినప్పుడు దేశంలోని మూడొంతుల మంది ఆమెను చూసేందుకు ఎగబడ్డారు.
హుందాగా వ్యవహరించడం, వివాదరహితంగా ఉండగలగడం ఆమె వ్యక్తిత్వపు కీలకాంశం. సుమారు 600 దాతృత్వ సంస్థలకు ఆమె ఆర్థిక సహాయం అందిస్తారు.

రాణిని చూడటం, మాట్లాడటం ఇప్పటికీ ఒక పెద్ద అంశంగా ఉన్నా సామాన్య జనానితో మాట్లాడటం ప్రారంభించింది ఆమే. రాజవంశస్థుల్లో సైన్యంలో చేరిన తొలి మహిళ కూడా ఆమే. అలాగే విధిగా రాణి/రాజు ముందు తలవంచి తీరాలనే ‘రాయల్ ప్రొటోకాల్’ను ఆమె సడలించారు. అయినా చాలామంది గౌరవపూర్వకంగా అలా చేస్తారు.

అరవై ఏళ్లుగా సింహాసనం మీద ఉంటున్న ఎలిజబెత్ బ్రిటన్‌ను పాలించినవారిలో అత్యంత వయోవృద్ధురాలు. మన చందమామ కథల్లోని రాణికి ఆమె నిలువెత్తు వాస్తవరూపం. కాకపోతే మనం ఊహించుకునే వస్త్రాల్లో కాకుండా కొంత ‘వెస్ట్ లుక్ ఇవ్వాలి.

775 గదుల రాజమహల్
1837 నుంచీ బ్రిటిష్ రాజవంశస్థుల అధికారిక లండన్ నివాసం బకింగ్‌హామ్ ప్యాలెస్. ఇందులో 775 గదులున్నాయి. దీనికి అతిథులుగా ఏటా 50,000 మంది వస్తారు. అలాగే ఆమె మరో నివాసం బెర్క్‌షైర్‌లోని విండ్సర్ క్యాజిల్. ఈ భవంతిలో అన్ని అవసరాలకుగానూ 500 మంది పనిచేస్తారు. సాధారణంగా రాణి ఇక్కడ వారాంతాలు గడుపుతారు. ఇక క్రిస్‌మస్ నుంచి ఫిబ్రవరి వరకు శాండ్రింగ్‌హమ్ హౌజ్‌లో ఉంటారు. ఇది ప్రైవేటు ప్యాలెస్. శాండ్రింగ్‌హమ్ అనే గ్రామంలో ఉండటంతో దీనికి ఆ పేరు. ఇది 20,000 ఎకరాల ఎస్టేట్.

మరిన్ని విశేషాలు...
రాణి పుట్టినరోజును ఏప్రిల్ 21నే కాకుండా, ప్రజల మధ్య అధికారికంగా జూన్ మొదటి లేదా రెండో శనివారాల్లో జరుపుతారు. వేసవి ముగిసి, వాతావరణం బాగుంటుందని ఇలా చేస్తారు.
ఎలిజబెత్ రాణికి మొత్తం 9 సింహాసనాలుంటాయి. ఒకటి ‘హౌస్ ఆఫ్ లార్డ్స్’ (బ్రిటన్ పార్లమెంట్ ఎగువసభ)లో, రెండు ‘వెస్ట్‌మినిస్టర్ అబ్బే’(చర్చ్)లో, మిగిలిన ఆరు బకింగ్‌హామ్ ప్యాలెస్‌లో.
దట్టమైన రంగుల ఓవర్‌కోట్స్, వాటికి మ్యాచ్ అయ్యే టోపీలు ధరించడం ఎలిజబెత్ ప్రధాన వస్త్రధారణ.
బ్రిటన్ పార్లమెంట్ ప్రారంభోపన్యాసం ఇప్పటివరకూ రెండుసార్లే చేయలేదు. ప్రిన్స్ ఆండ్రూ, ప్రిన్స్ ఎడ్వర్డ్ గర్భంలో ఉన్న 1959, 1963 సంవత్సరాల్లో.

‘ఫోర్బ్స్’ అంచనా ప్రకారం ఎలిజబెత్ రాణి ఆస్తుల విలువ కేవలం 45 కోట్ల అమెరికా డాలర్లు. రాజవంశీయుల చాలా ఆస్తులు దేశానికే చెందుతాయి.
రాణిని ఆధునిక బామ్మ అనొచ్చు. ఈ-మెయిల్, ఫేస్‌బుక్ అకౌంట్స్ ఉన్నాయి.
ఆమె మీద లెక్కకు మిక్కిలి పుస్తకాలు, సినిమాలు, టీవీ ఎపిసోడ్లు, పాటల ఆల్బమ్స్ వచ్చాయి.

రాణి ఏ పర్యటనకు వెళ్లినా భర్త ఫిలిప్ వెంటవుంటారు.
రెండు మూడు నెలలకోసారి వివిధ రంగాల్లో ఉన్న కొందరిని విందుకు పిలుస్తుంటారు రాణి దంపతులు.
ఇప్పటివరకూ 256 అధికారిక విదేశీ పర్యటనల్లో, 129 దేశాలు చుట్టివచ్చారు.
తన ఏలుబడిలో 60 ఏళ్ల దాంపత్య జీవితం (డైమండ్ జూబ్లీ) జరుపుకున్న బ్రిటన్, కామన్వెల్త్ దేశాల్లోని దంపతులకు శుభాకాంక్షలు అందజేస్తూ 5,20,000 టెలిగ్రామ్స్ పంపారు.
ఎలిజబెత్‌కు ప్రస్తుతం 85 సంవత్సరాలు. ఆమె మనవడు ప్రిన్స్ విలియమ్ గనక తండ్రి అయితే ఆమె ముత్తాతమ్మ అవుతారు.

తర్వాతి చక్రవర్తి ఎవరు?
సుమారు వెయ్యేళ్లుగా కొనసాగుతున్న బ్రిటన్ రాజవంశంలో ఎలిజబెత్ అనంతరం సహజంగానే ఆమె పెద్ద కుమారుడైన ప్రిన్స్ చార్లెస్ రాజవుతారు. తర్వాతి వరుసలో చార్లెస్, డయానాల తొలి సంతానమైన ప్రిన్స్ విలియమ్ ఉంటారు. ఆ తర్వాతి అవకాశం వారి రెండో సంతానం, విలియమ్ తమ్ముడు ప్రిన్స్ హ్యారీకి. అటుపై ఈ వరుసలో చార్లెస్ మొదటి తమ్ముడు ఆండ్రూ, తర్వాతి స్థానాల్లో ఆండ్రూ పిల్లలుంటారు.

ఇలా చాలామంది ఈ క్రమంలో వస్తారు. ఎందుకంటే రాజవంశంలో పుట్టిన ప్రతీ వ్యక్తీ ప్రాథమికంగా సింహాసనానికి అర్హులే. అయితే కిరీటం వాళ్లకు దక్కే అవకాశం దాదాపు ‘శూన్యం’. ఎందుకంటే పోయినేడాదే క్యాథెరీన్‌ను పెళ్లాడిన విలియమ్‌కు సంతానం కలగ్గానే ఆ శిశువు హ్యారీని నెట్టేసి ఆ స్థానాన్ని పూరిస్తాడు.

రాజి

Courtesy: sakshi.com

Saturday, February 4, 2012

Want to be successful as a leader?

do you want to be successful as a leader, follow below things

Form a group which is very very competent. Are you the decision maker, recruit the best. Going for non eligible candidates will simply be wasting your time

Saturday, December 31, 2011

Things to follow in life

Competencey
Listen
Read
Analyse
Think
Standards - best solution?
Organize - Plan
Quality
Now

Saturday, November 12, 2011

Kids Plans


కిడ్డీ ప్లాన్స్
పిల్లలు పుట్టినప్పటినుంచే వారి భవిష్యత్తు అవసరాల గురించి ఆలోచన చేసే తల్లిదండ్రుల సంఖ్య బాగా పెరుగుతోంది. మరికొంతమందైతే పెళ్లయిన దగ్గరినుంచి పుట్టబోయే పిల్లల భవిష్యత్తు గురించి ఆర్థిక ప్రణాళికలను తయారు చేసుకుంటున్నారు. అత్యధికంగా 63 శాతం మంది తల్లిదండ్రులు... పిల్లలు పుట్టిన వెంటనే వారి పేరు మీద మదుపును ప్రారంభిస్తున్నట్లు సర్వేలు వెల్లడిస్తున్నాయి. ఎక్కువమంది, పిల్లలకు మూడేళ్లురాగానే మదుపు ప్రారంభిస్తుంటే 20 శాతం మంది ఏడేళ్ళలోపు, 9 శాతం మంది పిల్లలు పుట్టకుండానే వారి కోసం పొదుపు చేస్తున్నారట. రేపు బాలల దినోత్సవం సందర్భంగా పిల్లల పేరు మీద ఉన్న ప్రత్యేక పథకాల సమాహారమే ఈ వారం ఫ్రాఫిట్ ముఖ్య కథనం

బీమా
అటు బీమా రక్షణ, ఇటు పన్ను ప్రయోజనాలు, ఇంకోపక్క ఇన్వెస్ట్‌మెంట్ ఇలా అన్ని ప్రయోజనాలు కలిసి ఉండటంతో పిల్లల కోసం పొదుపు అనగానే ఎవరికైనా బీమా పథకాలే గుర్తుకు వస్తాయి. వీటికి బాగా డిమాండ్ ఉండటంతో బీమా కంపెనీలు వివిధ రకాల పొదుపు పథకాలను అందిస్తున్నాయి. పిల్లల కోసం ఇన్వెస్ట్ చేస్తున్నవారిలో అత్యధికంగా 64 శాతం మంది బీమా పథకాలవైపే మొగ్గు చూపుతున్నట్లు ఒక సర్వేలో వెల్లడయ్యింది. బీమా పథకాలను మూడు రకాలుగా అంటే... ఎండోమెంట్ పాలసీ, మనీ బ్యాక్, యులిప్స్‌గా విభజించవచ్చు. చిల్డ్రన్ పాలసీల్లో మనీ బ్యాక్ పాలసీలే ఎక్కువగా ఉన్నాయి. వీటిల్లో సొమ్మును ఒకేసారిగా కాకుండా సంవత్సరానికి కొంత మొత్తం చొప్పున వెనక్కి ఇస్తుంటాయి.

ఈ పాలసీలు పిల్లలకి 18 సంవత్సరాల వయసు వచ్చినప్పటి నుంచి .. అంటే ఇంటర్మీడియెట్ విద్య పూర్తి అయ్యేసరికి డబ్బు చేతికి అందే విధంగా తీర్చిదిద్దుతున్నారు. ఎల్‌ఐసీకి చెందిన కోమల్ జీవన్, జీవన్ కిషోర్, జీవన్ అనురాగ్, చైల్డ్ ఫ్యూచర్ ప్లాన్ వంటి పథకాలు ఈ కోవకు చెందినవే. ఇక ఎండోమెంట్ పాలసీలు ...అంటే మొత్తం సొమ్ము ఒకేసారి చేతికి అందుతుంది. ఉన్నత చదువులు, పెళ్ళిళ్ళకు ఒకేసారి పెద్ద మొత్తం కావాలనుకునే వారికోసం ఈ పాలసీలను రూపొందించారు. ఈ విభాగంలో ఎల్‌ఐసీ.. జీవన్ ఛాయ, మ్యారేజ్ ఎండోమెంట్, ఎండోమెంట్ 18, ఎండోమెంట్ 21 పేరుతో పాలసీలను అందిస్తోంది.

యులిప్స్ విషయానికి వస్తే... మిగిలిన రెండింటితో పోలిస్తే వీటిలో రిస్క్ ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే మీ దగ్గర నుంచి సేకరించిన సొమ్మును ఈక్విటీలు, డెట్ పథకాల్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా వచ్చే ఆదాయాన్ని మీకు అందిస్తారు. యులిప్స్ నిధులను స్టాక్‌మార్కెట్లో కూడా ఇన్వెస్ట్ చేస్తారు కాబట్టి ఆ మేరకు కొంత రిస్క్ ఉంటుంది. కనుక, కొద్దిగా రిస్క్ చేయగలిగినవారికి ఇవి అనువైనవి. అయిదు సంవత్సరాల లాకిన్ పీరియడ్ అయిన తర్వాత నగదు అవసరమైనప్పుడు కొంత మొత్తం తీసుకునే వెసులుబాటునూ యులిప్స్ కల్పిస్తాయి. ఎల్‌ఐసీ ఫార్చ్యూన్ ప్లస్ ఈ కోవకు చెందినదే.
ఇప్పుడు దాదాపు అన్ని బీమా కంపెనీలు కొంత అదనపు ప్రీమియం చెల్లించడం ద్వారా అధిక ప్రయోజనాన్ని కల్పించే రైడర్లను అందిస్తున్నాయి. చిల్డ్రన్ పాలసీలు తీసుకునే వారు వైవర్ ఆఫ్ ప్రీమియం రైడర్‌ను తీసుకోవడం మర్చిపోవద్దు. దీని వలన తల్లిదండ్రులకు అనుకోని సంఘటన జరిగినా పాలసీ రద్దు కాదు. తదుపరి ప్రీమియంలు చెల్లించకుండానే పాలసీ కొనసాగుతుంది.

మ్యూచువల్ ఫండ్స్
ఈ మధ్య కాలంలో మ్యూచువల్ ఫండ్ సంస్థలు కూడా చిల్డ్రన్ ఫండ్స్‌పై అధికంగా దృష్టి సారిస్తున్నాయి. మార్కెట్లో దాదాపు పదికిపైగా చిల్డ్రన్ ఫండ్స్ అందుబాటులో ఉన్నాయి. ఒక లక్ష్యంతో ఇన్వెస్ట్ చేస్తున్నారు కాబట్టి అధిక రిస్క్ చేయకుండా ఈక్విటీలు, డెట్ పథకాల్లో బ్యాలెన్స్‌డ్‌గా పెట్టుబడి చేస్తాయి. కాబట్టి డైవర్సిఫైడ్ ఈక్విటీ పథకాలతో పోలిస్తే వీటిల్లో కొద్దిగా రిస్క్ తక్కువగా ఉంటుంది. కొద్దిగా రిస్క్ చేసేవారికి ఈక్విటీ ఓరియంటెడ్ చిల్డ్రన్ ఫండ్స్ అందుబాటులో ఉన్నాయి. గత మూడేళ్ళలో ఈ విభాగం సగటున 20 శాతం రాబడిని అందించింది. టెంపుల్టన్ ఇండియా క్యాప్ గిఫ్ట్‌ప్లాన్, హెచ్‌డీఎఫ్‌సీ చిల్డ్రన్ గిఫ్ట్, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ చైల్డ్‌కేర్-గిఫ్ట్, యూటీఐ చిల్డ్రన్ కెరీర్ ప్లాన్-అడ్వాంటేజ్ వంటివి ఈ విభాగంలోకి వస్తాయి. అదే డెట్ ఓరియంటెడ్ చైల్డ్ ఫండ్స్ విషయానికి వస్తే గడచిన మూడేళ్ళలో ఈ పథకాలు 9-10 శాతం వార్షిక రాబడిని అందించాయి. టాటా యంగ్ సిటిజన్స్, ఎల్‌ఐసీ చిల్డ్రన్, మాగ్నం చిల్డ్రన్ బెనిఫిట్, యూటీఐ చిల్డ్రన్ కెరీర్ ప్లాన్ బ్యాలెన్స్‌డ్ వంటి పథకాలున్నాయి.

స్థిరాదాయం
బీమా పథకాల తర్వాత పిల్లల పేరుమీద ఇన్వెస్ట్ చేయడానికి మొగ్గు చూపుతున్న వాటిల్లో బ్యాంకు డిపాజిట్లు పోస్టాఫీసు పథకాలు ఉన్నాయి. బ్యాంకులు అయిదు సంవత్సరాలు కంటే ఎక్కువ కాలపరిమితి గల డిపాజిట్లపై ఇప్పుడు 8-9 శాతం వరకు వడ్డీని అందిస్తున్నాయి. స్వల్పకాలిక అవసరాల కోసం అయిదు సంవత్సరాల రికరింగ్ డిపాజిట్లు, దీర్ఘకాలిక లక్ష్యాల కోసం పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్) పథకాలు అనుకూలంగా ఉంటాయి. వీటితో పాటు కిసాన్ వికాసపత్రాలు, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ వంటివి కూడా పిల్లల పేరుపైన ఇన్వెస్ట్ చేయవచ్చు. ఇప్పుడు కిసాన్ వికాసపత్రాలను రద్దు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇది ఇంకా అమలులోకి రాలేదు.


కిడ్స్ అకౌంట్స్
చిన్న పిల్లల్లో పొదుపు పట్ల అవగాహన, ఆర్థిక క్రమశిక్షణను పెంచడానికి పలు బ్యాంకులు కిడ్డీ బ్యాంక్ సౌకర్యాన్ని అందిస్తున్నాయి. ఆంధ్రాబ్యాంక్ కిడ్డీ బ్యాంక్ పేరుతో ఈ సౌకర్యాన్ని కల్పిస్తుండగా, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఇండియన్ బ్యాంక్, కెనరా బ్యాంక్, యునెటైడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వంటి ఇతర ప్రభుత్వరంగ బ్యాంకులు కూడా పిల్లలకోసం ప్రత్యేక సేవలు అందిస్తున్నాయి. వీటితో పాటు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐసీఐసీఐ, యాక్సిస్, ఐఎన్‌జీ వైశ్యా వంటి ప్రైవేటు బ్యాంకులు కూడా పిల్లల కోసం ప్రత్యేక ఖాతాలను తెరిచాయి. ఈ అకౌంట్స్ అన్నింటికీ తల్లిదండ్రులు లేదా సమీప బంధువులు ఎవరైనా గార్డియన్‌గా ఉండాల్సి ఉంటుంది. మినిమమ్ బ్యాలెన్స్‌తో ఖాతా నిర్వహణ, డెబిట్ కార్డు, చెక్‌బుక్ వంటి ఇతర సౌకర్యాలు కూడా లభిస్తాయి.

Saturday, September 10, 2011

House Loan

దేనికీ ఫిక్స్ కావద్దు రియల్ ఎస్టేట్ ధరలు తగ్గుముఖం పట్టినా పెరుగుతున్న వడ్డీరేట్లు గృహ రుణాలు తీసుకునే వారిని వెనుకంజ వేసేలా చేస్తున్నాయి. గత ఏడాదిన్నరలో రిజర్వు బ్యాంకు వడ్డీ రేట్లను ఏకంగా 11 సార్లు పెంచింది. దీంతో కొత్త కస్టమర్లను ఆకర్షించడానికి బ్యాంకులు, హౌసింగ్ ఫైనాన్స్ సంస్థలు ఫిక్స్‌డ్ రేట్ల పేరుతో సరికొత్త పథకాలను ప్రవేశపెడుతున్నాయి. తొలుత ఐసీఐసీఐ బ్యాంక్ ఫిక్స్‌డ్ రేట్ల పోటీకి తెరలేపగా హెచ్‌డీఎఫ్‌సీ, ఎల్‌ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ సంస్థలు అదే బాటను అనుసరించాయి. ప్రస్తుతస్థాయి నుంచి వడ్డీరేట్లు ఇంకా పెరిగే అవకాశముందా? ఫిక్స్‌డ్ వడ్డీరేట్లను ఎంచుకోవడం వల్ల ప్రయోజనాలేమైనా ఉన్నాయా అన్న అంశాలపై అవగాహన కల్పించేదే ఈ వారం ప్రాఫిట్ లీడ్ స్టోరీ. నిన్నటివరకు గృహరుణాల్లో ఫ్లోటింగ్ రేట్లకే పరిమితమైన బ్యాంకులు ఇప్పుడు తిరిగి ఫిక్స్‌డ్ రేట్లవైపు మొగ్గు చూపుతున్నాయి. ముఖ్యంగా వచ్చే పండుగల సీజన్‌లో కొత్త కస్టమర్లకు ఆకర్షణీయమైన రేట్లతో నిర్దిష్ట కాలపరిమితికి రుణాలు ఇవ్వడానికి బ్యాంకులు ముందుకు వస్తున్నాయి. సహజంగా ఫిక్స్‌డ్ వడ్డీరేట్లు ఫ్లోటింగ్ రేట్ల కంటే ఒకటి నుంచి రెండు శాతం అధికంగా ఉంటాయి. కాని ఈసారి ఫిక్స్‌డ్ వడ్డీరేట్లు ఫ్లోటింగ్ రేట్లకు దాదాపు సమానంగా లేక స్వల్పంగా ఎగువ స్థాయిలో ఉంటున్నాయి. వడ్డీరేట్లు ఇంకా పెరిగే అవకాశముందన్న ఆందోళన నేపథ్యంలో ఖాతాదారులు ఫిక్స్‌డ్ కాలపరిమితిగల రుణాలవైపు మొగ్గు చూపవచ్చన్నది బ్యాంకుల అంచనా. కాని నిర్ణయాలు తీసుకోవడంలో అన్ని అవకాశాలనూ సాకల్యంగా పరిశీలించాలని ఫైనాన్షియల్ కన్సల్టెంట్స్ నిపుణులు సూచిస్తున్నారు. వడ్డీరేట్లు కనిష్టస్థాయిలో ఉన్నప్పుడు ఫిక్స్‌డ్ రేటుకు బ్యాంకులు గృహరుణాలు ఇవ్వవనీ, వడ్డీ రేట్లు గరిష్టస్థాయికి చేరుకున్నాయన్న సంకేతాలు వచ్చినప్పుడు మాత్రమే బ్యాంకులు ఈ విధంగా ఫిక్స్‌డ్ రేట్లపై రుణాలను అందిస్తాయన్న ఒక అభిప్రాయం ఉంది. దీనివల్ల భవిష్యత్తులో ఒకవేళ వడ్డీరేట్లు తగ్గినా అధికరేటుపైనే కస్టమర్లు ఈఎంఐలు చెల్లించాల్సి వస్తుందంటున్నారు. ఇప్పటికే జూన్ క్వార్టర్లో దేశ వృద్ధి రేటు ఎనిమిది శాతం దిగువకు చేరుకోవడంతో పాలసీ రేట్లను రిజర్వు బ్యాంకు మరింతగా పెంచే సాహసం చేయకపోవచ్చని సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్, రైట్‌హొరెజైన్స్ సీఈవో అనిల్ రెగో తెలిపారు. ఇదేరకమైన సంకేతాలు ఆర్‌బీఐ నుంచి కూడా వస్తున్నాయి. ప్రస్తుతస్థాయి నుంచి మరో పావు శాతం మించి వడ్డీరేట్లు పెరిగే అవకాశాలు కనిపించడం లేదని బ్యాంకింగ్ రంగ నిపుణుడు తుమ్మల కిషోర్ అభిప్రాయపడ్డారు. వడ్డీరేట్లలో ఒడిదుడుకులు గత పదేళ్లుగా వడ్డీరేట్లలో భారీ హెచ్చు తగ్గులు చోటు చేసుకుంటున్నాయి. 2001లో గృహ రుణాలు గరిష్ట స్థాయిలో 14 శాతం(ఫ్లోటింగ్) చేరుకోగా అవి 2003 నాటికి కనిష్టస్థాయి 7 శాతానికి దిగివచ్చాయి. తిరిగి వేగంగా పెరుగుతూ 2007 చివరినాటికి 10.5-11 శాతానికి చేరాయి. అక్కడ నుంచి మళ్లీ అంతే వేగంగా పతనమవుతూ 2008 చివరినాటికి 8 శాతానికి పతనమయ్యాయి. అక్కడ నుంచి క్రమంగా పెరుగుతూ ఇప్పుడు తిరిగి 10.5-11 శాతానికి చేరాయి. అంటే 2007 చివరి నాటి గరిష్టస్థాయికి వడ్డీరేట్లు చేరుకున్నాయి. ఈ స్థాయి నుంచి తక్షణం తగ్గే అవకాశాలు లేవు. అంతేకాదు... ఇంతకంటే వేగంగా పెరిగే అవకాశాలూ లేవన్నది నిపుణుల భావన. ఇప్పటికీ ద్రవ్యోల్బణం రెండంకెల స్థాయిలో ఉండటంతో వడ్డీరేట్లు గరిష్టస్థాయిలోనే కొనసాగవచ్చన్నది కొంతమంది బ్యాంకర్ల ఆలోచన. మూడేళ్లకైతే ఓకే ఈ రుణాల పేరులో మాత్రమే ఫిక్స్‌డ్ కనిపిస్తుంది కాని ఇవి నిజంగా ఫిక్స్‌డ్ వడ్డీరేట్లు కావు. కేవలం స్వల్పకాలానికి మాత్రమే వడ్డీరేట్లు స్థిరంగా ఉంటాయి. ఆ తర్వాత ఇవి ఫ్లోటింగ్ రేటులోకి మారిపోతాయి. వడ్డీరేట్లలో హెచ్చు తగ్గులు ఎక్కువగా ఉంటున్నాయి కాబట్టి పూర్తి కాలానికి ఫిక్స్‌డ్ రేటును అందించడానికి బ్యాంకులు వెనకాడుతున్నాయి. ఇప్పుడు ఐసీఐసీఐ బ్యాంక్ స్వల్పకాలానికి ఒకటి రెండు సంవత్సరాలకే ఫిక్స్‌డ్ రేట్లను అందిస్తోంది. హెచ్‌డీఎఫ్‌సీ మూడు, ఐదేళ్లకు అందిస్తుంటే, ఎల్‌ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ ఐదేళ్లకు ఫిక్స్‌డ్ రేట్లను అందిస్తోంది. వచ్చే ఐదేళ్లు వడ్డీరేట్లు ఇంత గరిష్టస్థాయిలో నిలదొక్కుకోవడం కష్టమని, ప్రస్తుత స్థాయి నుంచి ఐదేళ్లలో తప్పకుండా తగ్గే అవకాశాలున్నందున ఫిక్స్‌డ్ వడ్డీరేట్ల కంటే ఫ్లోటింగ్ రేట్లలోనే రుణాలు తీసుకోవడం ప్రయోజనకరంగా ఉంటుందని అనిల్ రెగో అభిప్రాయపడ్డారు. వడ్డీరేట్లు తక్షణం దిగొచ్చే అవకాశాలు చాలా స్వల్పంగా ఉన్నాయి కాబట్టి చక్కటి ప్లానింగ్ చేసుకోవాలనుకునే వారు గరిష్టంగా మూడేళ్ల వరకు ఫిక్స్‌డ్ రేట్లలో రుణాలు తీసుకోవచ్చని కిషోర్ సూచిస్తున్నారు. ప్రస్తుతం చాలా బ్యాంకులు ఫ్లోటింగ్ రేట్ల స్థాయిలోనే ఫిక్స్‌డ్ రేట్లు అందిస్తున్నందున స్వల్పకాలానికి ఫిక్స్‌డ్ రేట్లు తీసుకోవచ్చంటున్నారు. ఎల్‌ఐసీ హౌసింగ్ ఫైనాన్స్‌లో ఫ్లోటింగ్ రేటు 10.65 శాతంగా ఉంటే ఫిక్స్‌డ్ రేటు 11.15 శాతంగా ఉంది. ఇలా ఈ రేటు ఐదేళ్లపాటు చెల్లించాల్సి ఉంటుంది. ఇలాంటి సందర్భాల్లో ఫ్లోటింగ్ రేటులోనే రుణాలు తీసుకోవడం ఉత్తమం అన్నది నిపుణుల మాట. ఫిక్స్‌డ్, ఫ్లోటింగ్ అంటే.. వివిధ బ్యాంకులు, మార్టిగేజ్ సంస్థలు గృహరుణాలను ఫిక్స్‌డ్, ఫ్లోటింగ్ వడ్డీరేట్లలో అందిస్తుంటాయి. ఫిక్స్‌డ్ రేటు విధానం ఎంచుకుంటే రుణం తీసుకున్న తర్వాత వడ్డీరేట్లు పెరిగినా, తగ్గినా సంబంధం లేకుండా మీరు రుణం తీసుకున్నప్పుడు ఉన్న రేట్లే కొనసాగుతాయి. అదే ఫ్లోటింగ్(చలన) రేటు ఎంచుకుంటే బ్యాంకులు, హౌసింగ్ ఫైనాన్స్ సంస్థలు వడ్డీరేట్లు మార్చినప్పుడల్లా మీరు చెల్లించే రేట్లు కూడా మారతాయి. గృహ రుణాలు తీసుకుంటున్న వారిలో 90 శాతం మందికి పైగా ఫ్లోటింగ్ రేటునే ఎంచుకుంటున్నట్లు అంచనా. ఐసీఐసీఐ బ్యాంక్ గత రెండేళ్లుగా గృహ రుణాల వ్యాపారంలో అంత చురుగ్గా పాల్గొనని ఐసీఐసీఐ బ్యాంక్ ఇప్పుడు ఫిక్స్‌డ్ రేట్లతో పథకాలను ప్రకటించింది. ఐసీఐసీఐ బ్యాంక్ ఒక సంవత్సరం, రెండు సంవత్సరాల కాలపరిమితితో కూడిన రెండు రకాల ఫిక్స్‌డ్ రేట్లను ప్రకటించింది. ఒక సంవత్సరం పాటు వడ్డీరేట్లు మారకుండా ఉండే పథకంలో రూ. 25 లక్షల లోపు రుణంపై 10.5%, రూ.25-75 లక్షలలోపు 11%, అంతకంటే ఎక్కువ విలువైన రుణాలపై 11.50% వడ్డీని ఆఫర్ చేస్తోంది. అదే రెండు సంవత్సరాలు ఫిక్స్‌డ్ రేటును ఎంచుకుంటే పై రేట్లకు పావు శాతం అదనంగా చెల్లించాలి. హెచ్‌డీఎఫ్‌సీ దేశీయ అతిపెద్ద హౌసింగ్ ఫైనాన్స్ సంస్థ హెచ్‌డీఎఫ్‌సీ మూడు, ఐదేళ్ల కాలానికి ఫిక్స్‌డ్ రేట్లపై గృహ రుణాలను అందిస్తోంది. మూడేళ్ల ఫిక్స్‌డ్ కాలానికి రూ.30 లక్షల లోపు రుణానికి 10.75 శాతం, రూ.30-75లక్షల లోపు రుణ మొత్తానికి 11.25 శాతం వడ్డీని వసూలు చేస్తుంటే ఐదేళ్ల కాలానికి వేర్వేరు మొత్తాలకు 11.25%, 11.50%గా ఉన్నాయి. రూ.75 లక్షలు దాటిన రుణానికి రెండింటిలో 11.75 శాతం వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. ఎల్‌ఐసీహెచ్‌ఎఫ్ ఎల్‌ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ సంస్థ కూడా ఐదేళ్ల కాలపరిమితికి ‘న్యూ అడ్వాంటేజ్-5’ పేరుతో ఫిక్స్‌డ్ వడ్డీరేట్లను ప్రకటించింది. రూ.30 లక్షలలోపు రుణానికి ఐదేళ్లపాటు 11.15%, రూ.30-75లక్షల వరకు 11.40%, రూ.75లక్షలు-1.50 కోట్ల వరకు 11.65 శాతం వడ్డీని ఎల్‌ఐసీహెచ్‌ఎఫ్ ఆఫర్ చేస్తోంది. ఈ ఏడాది డిసెంబర్ 31 వరకు అమలులో ఉండే ఈ రుణ పథకం కింద మొదటి విడత రుణ పంపిణీ 2012 జనవరి 15 లోగా తీసుకోవల్సి ఉంటుందని నిబంధన విధించింది. - ‘సాక్షి’ పర్సనల్ ఫైనాన్స్ విభాగం //Coutesy: Sakshi